+91-9912 347 247 info@adsandhra.com
Har Ghar Tiranga: మొదటి అడుగు వేసిన ప్రధాని.. మరి మీరో అంటూ మోదీ ట్వీట్
Har Ghar Tiranga: మొదటి అడుగు వేసిన ప్రధాని.. మరి మీరో అంటూ మోదీ ట్వీట్
Posted on Tue, Aug 02, 2022
Description

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రొఫైల్ ఫొటోను మార్చారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రపంచం చూసేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగానే ఆగస్టు 2-15 తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌ను జాతీయ జెండాతో ఉంచాలంటూ ఇప్పటికే ప్రధాని మోదీ కోరారు. ఈ క్రమంలోనే మొదటగా తానే తొలి అడుగు వేస్తూ తన ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మన దేశ త్రివర్ణ పతాకాన్ని అందించడంలో ఆయన చేసిన కృషికి మన దేశం ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని చూసి చాలా గర్వపడుతున్నానని.. త్రివర్ణ పతకం స్ఫూర్తితో దేశ ప్రగతికి మరింత కృషి చేస్తానంటూ మోదీ అన్నారు.