+91-9912 347 247 info@adsandhra.com
PM Kisan: రూ. 6 వేలు పొందేందుకు మీరు అర్హులేనా ?.. ఒక్కసారి తెలుసుకోండి..
PM Kisan: రూ. 6 వేలు పొందేందుకు మీరు అర్హులేనా ?.. ఒక్కసారి తెలుసుకోండి..
Posted on Wed, Jul 20, 2022
Description

ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగిన వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే సంస్థాగత భూస్వాములు కూడా అనర్హులు. * రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ, ప్రస్తుత హోల్డర్లు, మాజీ మంత్రులు, ప్రస్తుతం పదవిలో ఉన్నవారు, శాసన మండలి సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‏లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయితీ ఉద్యోగులు అనర్హులు. * కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్‌లు, దాని ఫీల్డ్ యూనిట్లు సెంట్రల్ లేదా స్టేట్ PSEలు, ప్రభుత్వ పరిధిలోని అటాచ్డ్ కార్యాలయాలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బందిని మినహాయించి) సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు) అనర్హులు. * నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా) అన్ని పదవీ విరమణ పొందిన/రిటైర్డ్ పెన్షనర్లు అనర్హులు. * గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించినవారు కూడా అనర్హులు. * డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నారు.

ఇప్పటివరకు 11 విడతల నగదు పొందిన అర్హులైన రైతులు వెంటనే తమ పీఎం కిసాన్ e-kycని జూలై 31లోపు పూర్తిచేయాలి. గడువు ముగిసేలోపు e-kycని పూర్తి చేయకపోతే నగదు రాదు.