పాఠశాల విద్యకు సంబంధించి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నది. నేటి నుంచి స్కూళ్ల రీఓపెనింగ్ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పంపిణీ ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది. ఇవాళ్టి (జూన్ 5, మంగళవారం) నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. తొలిరోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నారు..