+91-9912 347 247 info@adsandhra.com
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..
Posted on Sat, Jul 02, 2022
Description

భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. గత 24 గంటల్లో 17 వేేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో దాదాపు 15 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.భారత్‌లో గత 24 గంటల్లో 17,092 కరోనా కేసులు నమోదు కాగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 14,684 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకుంది. ఇండియాలో డైలీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.56 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకూ 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. మొత్త కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.25 శాతంగా ఉంది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ మన దేశంలో 5,25,168 మంది ప్రాణాలు కోల్పోయారు.